కన్నుల్లో నీరూపమే ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందు, తేజస్విని జంటగా బిక్స్ దర్శకత్వంలో భాస్కర్ బాసాని నిర్మిస్తోన్న ‘కన్నుల్లో నీరూపమే’ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రాజవౌళి క్లాప్‌నివ్వగా ప్రియాన్ష్ స్విచ్చాన్ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో నందు మాట్లాడుతూ, బిక్స్ న్యూయార్క్ ఫిలిం అకాడమీలో డైరెక్షన్ కోర్సు చేశాడు. సాఫ్ట్‌వేర్ జాబ్‌లో వున్న ఆయన సినిమాలమీద వున్న ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చాడు. ఇదొక థ్రిల్లర్ కామెడీ మూవీ. ఇప్పటివరకూ నేను ఇలాంటి పాత్రలో నటించలేదు. తప్పకుండా నన్ను మరో స్థాయికి తీసుకెళ్ళే పాత్ర ఇది అన్నారు. దర్శకుడు బిక్స్ మాట్లాడుతూ, కథ విని నన్ను ప్రోత్సహిస్తున్న నిర్మాతకు ధన్యవాదాలు. ఈ సినిమాలో 80 శాతం కామెడీ వుంటుంది. హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కే ఈ చిత్రాన్ని రెండు షెడ్యూల్స్‌లో పూర్తిచేస్తాం. కేరళలో పాటల్ని చిత్రీకరిస్తామన్నారు. నిర్మాత భాస్కర్ మాట్లాడుతూ, మా బ్యానర్‌లో వస్తున్న మొదటి చిత్రమిది. నేటినుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి పదిరోజుల్లో పూర్తిచేస్తాం. ఆ తరువాత జూలైలో రెండో షెడ్యూల్ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి సంగీతం:సాకేత్, ఆర్ట్:ప్రేంకుమార్, నిర్మాత:్భస్కర్ బాసాని, దర్శకత్వం:బిక్స్.