సంపత్నందితో మరో సినిమా చేయాలనుంది
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రవితేజ, తమన్నా, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా సంపత్నంది దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన బెంగాల్ టైగర్ చిత్రం ఇటీవల విడుదలై మంచి వసూళ్లతో దూసుకుపోతున్న సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటుచేసిన విజయోత్సవ సభలో రవితేజ మాట్లాడుతూ ఈ చిత్రంతో సంపత్నందికి హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా వుందని, ఈ సినిమా విజయంకోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని అన్నారు. ఈ నిర్మాత, దర్శకునితో మరో సినిమా చేయాలని వుందన్నారు. దర్శకుడు సంపత్నంది మాట్లాడుతూ రవితేజ మాట ఈ సినిమాతో నిజమైనందుకు ఆనందంగా వుందని, ముఖ్యంగా హీరోయిన్ల ఇద్దరి గ్లామర్ సినిమాకు చాలా ప్లస్ అయిందన్నారు. అన్ని ప్రాంతాల్లో మంచి వసూళ్లు సాధిస్తున్నాయని అన్నారు. తమన్నా మాట్లాడుతూ సంపత్నంది అద్భుతంగా దర్శకత్వం వహించారని, ఈ సినిమాలో రవితేజ నటన కొత్తగా వుందని అన్నారు. నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ సినిమాకు అన్ని ప్రాంతాలనుండి మంచి టాక్ వచ్చిందని, ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు సంతోషంగా వున్నారని, సంపత్నంది కాంబినేషన్తో వచ్చిన ‘ఏమైంది ఈవేళ’ సినిమాతో మంచి హిట్ అందుకున్నామని, మళ్లీ ఈ సినిమాతో మరో హిట్ దక్కినందుకు ఆనందంగా వుందన్నారు. ఈ కార్యక్రమంలో సుద్దాల అశోక్తేజ, సునీల్ నారంగ్, అశోక్కుమార్, నాగినీడు, రామ్లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.