కొత్తతరం కథ... కాళహస్తి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
దర్శకుడు జయంత్ సి.పరాంజి దర్శకత్వంలో నూతన చిత్రం కాళహస్తి ప్రారంభమైంది. ఏపీ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ కథానాయకుడిగా శారద ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో గురువారం ఉదయం జరిగింది. నిర్మాత డి.సురేష్బాబు తొలి సన్నివేశంపై క్లాప్నివ్వగా, పరుచూరి వేంకటేశ్వరరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. కె.రాఘవేంద్రరావు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకులు జయంత్ సి.పరాంజి మాట్లాడుతూ, ఎన్ని కథలు విన్నా రొటీన్గానే అనిపించడంతో చాలాకాలం సినిమా తీయలేదని, దీన్రాజ్ చెప్పిన కథ రియలిస్టిక్గా వుండడంతో ఈ చిత్రాన్ని తీయడానికి ముందుకు వచ్చానని తెలిపారు. ఇది ఓ కొత్త తరానికి చెందిన కథానాయకుడి కథగా వుంటుందని, ఈ కథ వినగానే ఇలాంటి కథకోసమే తాను ఇన్నాళ్ళు ఎదురుచూసాననిపించిందన్నారు. సినిమా మొదటినుంచీ ఎనర్జిటిక్గా సాగుతుందని, ప్రేక్షకులకు థ్రిల్ కలిగించే అంశాలు వుంటాయని అన్నారు. ఈ నెలాఖరున షూటింగ్ను ప్రారంభించి వైజాగ్, కాళహస్తిలో ఎక్కువ భాగం షూటింగ్ చేస్తామని, రెండు పాటలను ఫారిన్లో చిత్రీకరిస్తామని తెలిపారు. మూడు షెడ్యూల్స్లో సినిమాను పూర్తిచేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఓ మంచి చిత్రంతో కథానాయకుడిగా పరిచయం కావడం, ఓ మంచి దర్శకుడి దగ్గర తొలి సినిమా చేయడం చాలా ఆనందాన్నిస్తోందని కథానాయకుడు రవి తెలిపారు. కార్యక్రమంలో దీన్రాజ్, కృష్ణమాయ, హర్షవర్థన్ తదితరులు చిత్ర విశేషాలను తెలిపారు. ప్రదీప్ రావత్, ముఖేష్రుషి, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, ఐశ్వర్య, ఝాన్సీ, సత్యకృష్ణ, సమీర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, మాటలు:హర్షవర్థన్, సంగీతం:అనూప్ రూబెన్స్, కెమెరా:జవహర్రెడ్డి, నిర్మాత:అనీల్కుమార్ కిషన్, దర్శకత్వం:జయంత్ సి.పరాంజి.