శర్వానంద్ శతమానం భవతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శర్వానంద్ కథానాయకుడుగా సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో రాజు రూపొందిస్తున్న ‘శతమానం భవతి’ షూటింగ్ ప్రారంభమైంది. సత్యరంగయ్య క్లాప్ ఇవ్వగా యశ్వంత్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ, ఈ కథ మూడు తరాలకు సంబంధించినదని, సెప్టెంబర్ 14నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామన్నారు. సాధారణంగా పెద్దలు ఆశీర్వదించే సమయంలో చెప్పే శతమానం భవతి అనే మాటలోనే పాజిటివ్ నెస్ ఉందని, యూత్ ఫ్యామిలీ ఆడియన్లకు నచ్చేలా రూపొందించే ఈ చిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుందని తెలిపారు. ఈ సినిమాలో తాను కథానాయకుడుగా నటించడం సంతోషంగా ఉందని శర్వానంద్ అన్నారు. ఒక జీవితానికి సంబంధించిన విషయానే్న ఈ సినిమాలో చూపిస్తున్నామని, దర్శకుడు వేగ్నేశ సతీష్ అన్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించే ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, జయసుధ, ఇంద్రజ, శివాజీరాజా, ప్రవీణ్, సిజ్జు, శ్రీరామ్, మధురిమ, నీల్య, ప్రమోదిని, మహేష్, భద్రం, హిమజ, ప్రభు తదితరులు నటించనున్నారు.