మదర్ సెంటిమెంట్ పండింది ... పూరి జగన్నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనేక చిత్రాల అనంతరం ‘లోఫర్’ చిత్రంలో మదర్ సెంటిమెంట్‌తో చేసిన కథంతా ప్రేక్షకులకు నచ్చిందని, ఏ ఊరికి వెళ్లినా ఆ ఊరి థియేటర్‌లో ఈ సెంటిమెంట్ పండి, ప్రేక్షకుల స్పందన అద్భుతంగా వచ్చిందని దర్శకుడు పూరి జగన్నాథ్ తెలిపారు. శ్రీ శుభశే్వత ఫిలిమ్స్ పతాకంపై వరుణ్‌తేజ్ కథానాయకుడుగా సి.కళ్యాణ్ రూపొందించిన ‘లోఫర్’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయ యాత్రలు నిర్వహించారు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన సినిమా యూనిట్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ప్రతి ఊరు, ప్రతి థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందనను ఆస్వాదించామని, ముఖ్యంగా వరుణ్‌కు రేవతి, పోసానిలకు మంచి ఆదరణ లభిస్తోందని, థియేటర్లకు అంతా మహిళలే రావడం మరింత ఉత్సాహాన్నిచ్చిందని ఆయన తెలిపారు. మదర్ సెంటిమెంట్‌తో కూడిన ఈ ఫ్యామిలీ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో చూస్తున్నారని, కలక్షన్లపరంగా సంతోషంగా వున్నామని ఆయన అన్నారు. వైజాగ్ నుండి తూర్పుగోదావరి జిల్లావరకు నిర్వహించిన విజయ యాత్రల్లో పాజిటివ్ రెస్పాన్స్ లభించిందని, ప్రేక్షకుల నుండి వస్తున్న ఫీడ్‌బ్యాక్ మరింత ఉత్సాహాన్నిస్తోందని, తాను చేసిన రెండు సినిమాల్లో ‘లోఫర్’ పాత్ర వైవిధ్యంగా సాగిందని, వరుణ్‌తేజ్ తెలిపాడు. కార్యక్రమంలో చరణ్‌దీప్, అశోక్‌తేజ, కందికొండ, రమ్య, వంశీ తదితరులు పాల్గొన్నారు.