గౌతమీపుత్ర రాజసూయ యాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లి. పతాకంపై రూపొందిస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి సంబంధించిన షూటింగ్ మధ్యప్రదేశ్‌లో శరవేగంగా సాగుతోంది. బాలకృష్ణ, హేమమాలిని, శ్రీయ, పాల్గొనే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈనెల 6వ తేదీనుండి రాజసూయ యాగానికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, అఖండ భారతాన్ని ఏకతాటిపై తేవడానికి పురాణాలలో ధర్మరాజు, చారిత్రాత్మకంగా శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి మాత్రమే రాజసూయాగాన్ని నిర్వహించారని, ఆ సమయంలోనే రాజు తన తల్లి గౌతమి పేరును తన పేరు ముందు ఉంచుకుని గౌతమీపుత్ర శాతకర్ణిగా మారారని అన్నారు. తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన రారాజు కథను రూపొందిస్తుండడం అందరికీ ఆసక్తి పెరిగిందని, వారి అంచనాలను అందుకునేలా ఈ సినిమాను చిత్రీకరిస్తున్నామని ఆయన అన్నారు. భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ విలువలతో రూపొందే ఈ సినిమాకు సంబంధించిన ఈ షెడ్యూల్ ఈనెల 20 వరకు జరుగుతుందని ఆయన అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:జ్ఞానశేఖర్, పాటలు:సీతారామశాస్ర్తీ, మాటలు:సాయిమాధవ్ బుర్రా, దర్శకత్వం:క్రిష్.