అందరికీ నచ్చే మజ్ను -నాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేచురల్ స్టార్ నాని హీరోగా వర్మ దర్శకత్వంలో కేవా మూవీస్ పతాకాలపై అందిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మజ్ను’. ఈ చిత్రం సెన్సార్ పూర్తిచేసుకొని ‘యు/ఎ’ సర్ట్ఫికెట్ పొందింది. సెప్టెంబర్ 23న వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ.. ‘గోపీసుందర్‌గారు మంచి సంగీతంతోపాటు మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అందించారు. ఆయన సంగీత దర్శకత్వంలో విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నాని సినిమాలన్నీ హిట్ అవుతాయని అందరూ అనుకుంటున్నారు. నా మిత్రుడు కూడా ఫోన్‌చేసి అదే విషయాన్ని చెప్పాడు. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. మంచి టీం సినిమాను 53రోజుల్లో పూర్తిచేసింది. హీరోయిన్స్ చక్కగా చేశారు. నా కెరీర్‌లో నాని కెరీర్‌లో ఈ ‘ఈ సినిమా మంచి సినిమాగా నిలిచిపోతుంది’అన్నారు. హీరో నాని మాట్లాడుతూ.. ‘సెప్టెంబర్ 23న సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా విడుదలకోసం నేను కూడా ఎగ్జయిట్‌మెంట్‌గా వెయిట్ చేస్తున్నాను. ఇక విరించివర్మ గురించి చెప్పాలంటే తనతో ‘ఉయ్యాలా జంపాలా’ సినిమానుండి పరిచయం ఉంది. ఆ సినిమా కథను ముందు నాకే చెప్పాడు. తర్వాత నిన్నటి వెనె్నల అనే షార్ట్ ఫిలింను డైరెక్ట్‌చేశాడు. ఆ షార్ట్ఫిలిం చూసిన తర్వాత విరించితో పనిచేయాలనుకునేవాడిని ఆ సమయంలోనే విరించి జెమిని కిరణ్‌తో నన్ను కలిశారు. కథ నచ్చడంతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. సినిమాను బాగా ఎంజాయ్ చేస్తూ నటించాను. విరించి మనసులో నుండి వచ్చిన కథ. ఈ సినిమా చేయడం గర్వంగా ఉంది. గోపీసుందర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఫ్యామిలీ, పిల్లలతో కలిసి అందరూ చూసే సినిమా. వంద శాతంతో మజ్ను పెద్ద హిట్ అవుతుందని నమ్మకంతో చెబుతున్నాను’ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అను ఇమాన్యుయల్, సత్య తదితరులు పాల్గొన్నారు.