ప్రతిక్షణం భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీష్, తేజస్విని జంటగా భాగ్యలక్ష్మి మూవీ మేకర్స్ పతాకంపై నాగేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో మల్లికార్జున్‌రెడ్డి అందిస్తున్న చిత్రం ‘ప్రతిక్షణం’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సీడీని ఆర్.పి.పట్నాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా విజయవంతం కావాలని, పాటలు, ట్రైలర్లు అందరికీ నచ్చేలా ఉన్నాయని అన్నారు. కమర్షియల్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రం రొటీన్‌గా వుండదని, సినిమాలో ట్విస్ట్‌లు వుంటాయని దర్శకుడు నాగేంద్రప్రసాద్ అన్నారు. ప్రతి సీన్ ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని ఇస్తుందని, భయంతో ప్రతిక్షణం గడుపుతుంటే ఎలా వుంటుంది అనే కథనంతో చిత్రం రూపొందించామని ఆయన అన్నారు. దర్శకుడు చెప్పిన పాయింట్ నచ్చడంతో అనుకున్న షెడ్యూల్‌లోనే సినిమా పూర్తిచేశామని, హారర్ సినిమా కాదని, దెయ్యం వుండదని, ప్రతిక్షణం ఆసక్తిగా సాగుతుందని నిర్మాత మల్లికార్జున్ తెలిపారు. ఇందులో మల్లికార్జున్, రఘురాం, మనీష్, కృష్ణుడు, రాజ్‌కందుకూరి, మదన్, నరేష్‌కుమార్, సురేష్‌వర్మ, మల్కాపురం శివకుమార్, నవీన్ యాదవ్, తేజస్విని పాల్గొన్నారు.