మర్డర్ మిస్టరీతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధువర్మ, అంజలి హీరో హీరోయిన్‌గా కె.వెంకటేష్ దర్శకత్వంలో లక్ష్మీప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై మైల వీర్రాజు, తిరుమాని రాధాకృష్ణ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.2 చిత్రం జనవరి 18 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు వెంకటేష్ మాట్లాడుతూ, ఇది తన రెండవ సినిమా అని, ఇదివరకే ‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబూ అనే’ చిత్రాన్ని రూపొందించానని అన్నారు. ఇక కొత్త సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జనవరి 18 నుండి సింగిల్ షెడ్యూల్‌లో పూర్తిచేస్తామని, ఏకధాటిగా 45 రోజులపాటు జరిగే షెడ్యూల్‌లో సినిమా పూర్తవుతుందని అన్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ చిత్రం మర్డర్ మిస్టరీతో సాగుతుందని, మిగతా నటీనటులను, టెక్నీషియన్లను త్వరలో తెలియజేస్తామన్నారు. నిర్మాత వీర్రాజు మాట్లాడుతూ, ఇది తమ మొదటి చిత్రమని, దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నామని, అన్నిరకాల కమర్షియల్ అంశాలతో ఈ చిత్రం రూపొందిస్తున్నామని అన్నారు. హీరోయిన్ అంజలి మాట్లాడుతూ, ఈ సినిమాలో నటిస్తుండడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా నా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది అన్నారు. హీరో మధువర్మ మాట్లాడుతూ, ఇటీవలే పాటల రికార్డింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతుండడం ఆనందంగా ఉంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:జోస్యభట్ల, నిర్మాతలు:మైల వీర్రాజు, తిరుమాని రాధాకృష్ణ, దర్శకత్వం:కె.వెంకటేష్.