బోయపాటి చిత్రం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సరైనోడు’ సక్సెస్ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై రూపొందే చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. లాంఛనంగా ప్రారంభమైన ముహూర్తపు సన్నివేశానికి బోయపాటి శ్రీను కుమార్తె బోయపాటి జ్యోషిత క్లాప్‌నివ్వగా నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి కుమార్తె మిరియాల ద్వారక స్విచ్చాన్ చేశారు. అనంతరం నిర్మాత రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, బోయపాటి శ్రీను-బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందే సినిమా ఈరోజు ప్రారంభించామని, వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా చేయడం ఆనందంగా వుందని, ఈనెల 16 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని అన్నారు. దేవిశ్రీ సంగీతం అందించే ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘సరైనోడు’ విజయం తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తుండడం ఆనందంగా వుందని, లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం వుంటుందని అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా:రిషి పంజాబి, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత:మిరియాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం:బోయపాటి శ్రీను.