డిసెంబర్‌లో ధ్రువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా గీతా ఆర్ట్స్ పతాకంపై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ధ్రువ’. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు నేరుగా మార్కెట్‌లో విడుదలయ్యాయి. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, భారీ బడ్జెట్‌తో టెక్నికల్ విలువలతో రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన పాటలను హిప్‌హాప్ ఆది అందించారని, విడుదలైన పాటలు ప్రేక్షకులకు నచ్చాయని తెలిపారు. పవర్‌ఫుల్ యాక్షన్ ధ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని వారు తెలిపారు. అరవింద్‌స్వామి విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాజర్, పోసాని కృష్ణమురళి ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా:పి.ఎస్.వినోద్, ఎడిటింగ్:నవీన్ నూలి, నిర్మాతలు:అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్, దర్శకత్వం:సురేందర్‌రెడ్డి.