మణిరత్నం డ్యూయెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాలంటే ఇష్టపడని ప్రేక్షకుడు వుండడు. ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన శైలే వేరు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు తమిళంతోపాటు తెలుగులోనూ ఘనవిజయాలు సాధించాయి. ‘ఓకె బంగారం’ తరువాత ఆయన రూపొందిస్తున్న చిత్రం ‘డ్యుయెట్’. కార్తీ హీరోగా తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ లవ్ స్టోరీ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు. రోజా సినిమా తరువాత మణిరత్నం రూపొందిస్తున్న యాక్షన్ లవ్ స్టోరీ చిత్రం ఇదే. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు వివరాలు తెలియజేశారు. ‘ఓకె బంగారం సినిమా షూటింగ్ ప్రారంభంలో మణిరత్నం ఈ స్టోరీ చెప్పారు. చాలా నచ్చింది. అందుకే తెలుగులో విడుదల చేస్తున్నాము. తప్పకుండా మరో సూపర్‌హిట్ సినిమా అవుతుందన్న నమ్మకం వుంది. మార్చి 2017లో ఈ సినిమాను విడుదల చేస్తాం’ అని అన్నారు. డిసెంబర్‌లో ఒక షెడ్యూల్ విదేశాల్లో జరుగుతుంది. దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇప్పటివరకు చెన్నై, హైదరాబాద్, లేహ్, లడక్‌లో చిత్రం షూటింగ్ జరిపారు. ఈ చిత్రానికి సంగీతం:ఎ.ఆర్.రెహమాన్, కెమెరా:రవివర్మ, ఎడిటింగ్:శ్రీకర్ ప్రసాద్, నిర్మాత:దిల్‌రాజు, సమర్పణ:శిరీష్, దర్శకత్వం: మణిరత్నం.