ధ్రువ ట్రైలర్స్ అదుర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా గీతా ఆర్ట్స్ పతాకంపై సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘ధ్రువ’. ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్భంగా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత అరవింద్ మాట్లాడుతూ- ఈ చిత్రాన్ని 2వ తేదీనే విడుదల చేయాలనుకున్నా పెద్దనోట్ల రద్దువల్ల వాయిదా వేశామని, 9న అయితే బాగుంటుందని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నామని తెలిపారు. ట్రైలర్‌ను ప్రీ రిలీజ్‌కు వేడుకలో విడుదల చేయాలనుకున్నామని, చూసినవారందరూ ట్రైలర్స్ బాగున్నాయని అనడంతో ఈ ట్రైలర్‌ను ప్రేక్షకులకు చూపించాలని ముందుగానే విడుదల చేస్తున్నామని తెలిపారు. వైజాగ్, తిరుపతి, విజయవాడ లాంటి అన్ని పట్టణాల్లో ఈ ప్రమోషన్స్ జరుగుతున్నాయని, న్యూజెర్సీ, శాన్‌ఫ్రాన్సిస్కోతో సహా యుఎస్‌లో అనేక చోట్ల ప్రిమియర్ షో ప్రదర్శించనున్నామని ఆయన తెలిపారు. మూవీ ప్రీ రిలీజ్ వేడుక కూడా డిసెంబర్ 4న నిర్వహించనున్నామని ఆ వివరాలను త్వరలో తెలుపుతామని ఆయన అన్నారు. చరణ్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడని మరో నిర్మాత ఎన్.వి.ప్రసాద్ తెలిపారు. తన కెరీర్‌లో ‘ధ్రువ’ స్పెషల్‌గా నిలుస్తుందని, తనకు ఇష్టమైన తనిఒరువన్ చిత్రాన్ని ఎవరు తెలుగులో రీమేక్ చేస్తారా అని ఎదురుచూసిన తనకు అందులోనే హీరోయిన్‌గా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని నటి రకుల్ తెలిపారు. 9న విడుదలకానున్న ఈ చిత్రంలో అరవింద్‌స్వామి, నాజర్, పోసాని కృష్ణమురళి తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా:పి.ఎస్.వినోద్, సంగీతం:హిప్ హాప్ తమిళ, ఎడిటింగ్:నవీన్ నూలి, దర్శకత్వం:సురేందర్‌రెడ్డి.