కోటీశ్వరుడికి కరెన్సీ కరువు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన్‌చంద్ర, పృధ్వీ కథానాయకులుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ రూపొందించిన ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెలో 16న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రాన్ని ముందే విడుదల చేయాలనుకున్నామని, అయితే, కరెన్సీ సమస్యను దృష్టిలో ఉంచుకుని 16న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్లు విడుదలై అందరినీ ఆకట్టుకున్నాయని, ఆడియో కూడా సూపర్‌హిట్‌గా నిలిచిందని తెలిపారు. సినిమా కూడా విజయవంతమవుతుందన్న నమ్మకం వుందని, ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడానికి ఈనెల 16న థియేటర్లకు కోటీశ్వరులు వస్తున్నారని ఆయన వివరించారు. సలోని, శృతిశోధి కథానాయికలుగా నటించారు.