విశాఖలో నువ్వేచెప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సన్నీ, ప్రశాంత్, ప్రసన్న, అక్చిత ప్రధాన తారాగణంగా వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై శివశ్రీ దర్శకత్వంలో డాక్టర్ మళ్ల విజయప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘ఇంకేంటి.. నువ్వే చెప్పు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. సినిమా ఆడియో వేడుక వైజాగ్ ఆర్‌కె బీచ్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నటుడు సుమన్ మాట్లాడుతూ సాగర తీరాన ఈ కార్యక్రమాన్ని అందరికీ నచ్చేలా తీర్చిదిద్దినట్టుగానే సినిమా కూడా అంతే అందంగా వుంటుందని భావిస్తున్నానని అన్నారు. అందరూ కొత్త వారితో రూపొందించిన ఈ చిత్రం వైవిధ్యమైన కథాకథనాలతో వెల్ఫేర్ క్రియేషన్స్ సంస్థ విలువ తగ్గకుండా రూపొందిందని, కథాకథనాలు సరికొత్తగా సాగుతాయని తెలిపారు. సినిమా సందేశాత్మకంగా ఉండాలన్న నమ్మకంతో రూపొందించిన ఈ చిత్రంలోని పాటలు విడుదలయ్యాయని, త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, యువతకు ఓ మెసేజ్ అందేలా రూపొందించిన ఈ సినిమాలో ప్రతి సన్నివేశం సరికొత్తగా ఉంటుందని, అందరూ కొత్తవారైనా చక్కగా నటించారని నిర్మాత విజయప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో హీరోహీరోయిన్లు సన్నీ, ప్రశాంత్, అక్చిత, ప్రసన్న, నాగేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొని విశేషాలను తెలిపారు.