మమ్ముట్టితో మనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని ఫ్యామిలీ సినిమాగా తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్న ‘మనం’ సినిమా ఇప్పుడు మలయాళంలో రీమేక్ అవుతుంది. తెలుగు సినిమా క్లాసిక్‌గా ఇమేజ్ తెచ్చుకున్న ఈ సినిమాలో అక్కినేని మూడుతరాల నటులు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌లు నటించారు. భిన్నమైన కథతో తెరకెక్కిన ఈ సినిమా అందరి ప్రశంసలు అందుకుంది. బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న ఈ సినిమాను తమిళంలో కూడా రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నటుడు మమ్ముట్టి మలయాళంలో ఈ సినిమాను పట్టాలు ఎక్కించే పనిలో పడ్డాడు. మమ్ముట్టి ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్‌లతోపాటు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సీనియర్ నటుడు మధు నటిస్తాడట! హీరోయిన్స్‌గా శ్రీయ పాత్రలో మమతా మోహన్‌దాస్, సమంత పాత్రలో నిత్యామీనన్ నటిస్తుందట.