నేను లోకల్ హిట్ ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో శిరీష్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘నేను లోకల్’. ఆటిట్యూడ్ ఈజ్ ఎవిరీథింగ్...అంటూ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం కాకినాడలో నిర్వహించారు. దిల్‌రాజుతో సహా చిత్ర యూనిట్ సభ్యులు బిగ్ సీడీ, ఆడియో సీడీలను విడుదల చేశారు. దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘క్యారెక్టర్ బేస్డ్ లవ్‌స్టోరీస్ ఉన్న ‘ఇడియట్’, ‘ఆర్య’ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి యాటిట్యూడ్ ఈ ఎవ్రీథింగ్ అంటూ ఒక లవ్‌స్టోరీకి ఒక క్యారెక్టర్ ఉంటే ఎలా ఉంటుందో అదే ‘నేను లోకల్’ సినిమా. ఈ సూపర్‌హిట్ అవుతుంది. నాని నేచురల్ పెర్‌ఫార్మర్. నాని బెస్ట్‌గా నటించాడు. కీర్తి ఈ సినిమాలో మంచి రోల్ చేసింది. ఇండిపెండెంట్‌గా హీరోగా ఎదిగిన వాళ్ళలో హీరో నాని ఒకడు. ఈ సినిమా ఐదు సక్సెస్‌లు తర్వాత వస్తున్న సినిమా. నాని సెకండ్ హ్యాట్రిక్ మూవీ అవుతుంది. ‘సినిమా చూపిస్తమావా’ యూనిట్ సభ్యులే ఈ సినిమాకు వర్క్‌చేశారు. దేవి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలవుతుంది. ఈనెలలో శతమానంభవతి హిట్ కొట్టాం. నెక్స్ట్ ‘నేనులోకల్’తో సక్సెస్ సాధిస్తాం’ అన్నారు.
కీర్తిసురేష్ మాట్లాడుతూ.. ‘దిల్‌రాజు, బెక్కం వేణుగోపాల్, హర్షిత్, శిరీష్‌లు మంచి అవకాశం ఇచ్చారు. త్రినాథరావు డైరెక్షన్‌లో వర్క్‌చేయడం మరచిపోలేని ఎక్స్‌పీరియెన్స్. నిసార్ తన సినిమాటోగ్రఫీతో ప్రతి సీన్‌ను అందంగా చూపించాడు. దేవిశ్రీప్రసాద్‌గారితో ‘నేను శైలజ’ తర్వాత వర్క్‌చేశా. మరోసారి దేవిగారు వండర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. నాని కంఫర్ట్‌బుల్ కోస్టార్. చాలా మంచి వ్యక్తి. ఒక మంచి టీంతోవర్క్ చేసినందుకు ఆనందంగా ఉంది’ అన్నారు. హీరో నాని మాట్లాడుతూ.. ‘నేను లోకల్’ గురించి ఏం చెప్పాలో తెలియడం లేదు. థియేటర్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిందే. త్వరలో అంటే ఫిబ్రవరిలో లోకల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. కచ్చితంగా అందరినీ డిస్ట్రబ్ చేస్తాం. దిల్‌రాజు, నేను కలిసి ఎప్పటినుండో సినిమా చేయాలనుకున్నాం. కానీ ఇప్పటికీ కుదిరింది. దిల్‌రాజు, ఆయన టీంవల్లే మంచి సినిమాను చేయగలిగాం. హీరోగా చేస్తున్నా, నా సినిమాలో కీలక పాత్ర చేసిన నవీన్‌చందర్‌కు థాంక్స్. కీర్తిసురేష్ మంచి పెర్‌ఫార్మర్. త్రినాథ్ ప్రసన్న, సాయికృష్ణ రాసిన కథను ఎంతో ఆనందంగా తెరకెక్కించారు. బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు కంప్లీట్ ఎంటర్‌టైనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్‌రాజు, నాని, కీర్తిసురేష్, శిరీష్, దేవిశ్రీప్రసాద్, నవీన్‌చందర్, అరుణ్‌కుమార్, శ్రీదేవి, బెక్కం వేణుగోపాల్, డైరెక్టర్ త్రినాథరావు నక్కిన, అలీంబాషా, దొరబాబు, సాయికృష్ణ, ప్రసన్‌కుమార్ పాల్గొన్నారు.