నేను కిడ్నాప్ అయ్యాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో మధుర మూవీస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీకర్‌బాబు దర్శకత్వంలో మాధవి అద్దంకి నిర్మిస్తున్న చిత్రం ‘నేను కిడ్నాప్ అయ్యాను’. ఇటీవలే హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రానికి సంబంధించి హైదరాబాద్, వైజాగ్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరపనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- ‘విభిన్నమైన కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. పోసాని ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ కార్టూనిస్టు మల్లిక్ ఓ భిన్నమైన పాత్ర పోషిస్తున్నాడు. సస్పెన్స్ అంశాలతో ఎంటర్‌టైనర్‌గా సాగే చిత్రమిది’ అన్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, రఘుబాబు, కృష్ణ్భగవాన్, సత్య, కోట శంకర్‌రావు, సత్యానంద్ తదితరులు నటిస్తుండగా, ఈ చిత్రానికి సంగీతం:శ్రీకాంత్, స్క్రీన్‌ప్లే:దివాకర్‌బాబు, మాటలు:మల్లిక్, పాటలు:గోంగోత్రి విశ్వనాధ్, నిర్మాత:మాధవి అద్దంకి, కథ, దర్శకత్వం:శ్రీకర్‌బాబు.