త్వరలో శ్రీవల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంజిత్, నేహా హీరో హీరోయిన్లుగా వి.విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై రాజ్‌కుమార్ బృందావనం నిర్మిస్తున్న చిత్రం ‘శ్రీవల్లి’. ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్‌కి మంచి స్పందన రావడంతోపాటు ఆడియో కూడా మంచి హిట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా నిర్మాత రాజ్‌కుమార్ మాట్లాడుతూ, ‘విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించడం గర్వంగా ఉంది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన సైంటిఫిక్ ఎరోటిక్ థ్రిల్లర్ ఇది. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పటికే ట్రైలర్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా బ్యానర్‌లో ఇలాంటి మంచి చిత్రాన్ని నిర్మించినందుకు ఆనందంగా ఉంది. చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తికావచ్చాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, కెమెరా: రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సునీతారాజ్‌కుమార్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: విజయేంద్రప్రసాద్.