యువ హీరోలతో నటించడం అదృష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారారోహిత్, సందీప్‌కిషన్, సుధీర్‌బాబు, ఆది హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్న శమంతకమణి చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల క్లాప్‌నివ్వగా, నిర్మాత ఆనంద ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు రాజేంద్ర ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ- నటుడిగా 40 వసంతాలు పూర్తిచేసుకున్నానని, ఇనే్నళ్లు సక్సెస్‌ఫుల్‌గా నటిస్తున్నందుకు ప్రేక్షకుల ఆదరణే కారణమని అన్నారు. ముఖ్యంగా యువ హీరోల కాంబినేషన్‌లో మల్టీస్టారర్ చేయడం ఇంకా ఆనందంగా వుందని అన్నారు. సందీప్‌కిషన్ మాట్లాడుతూ- మంచి కథ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే సినిమాలో ఆది, సుధీర్, రోహిత్‌లు నాతోపాటు నటిస్తుండడం ఆనందంగా వుంది అన్నారు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ, ఫేస్‌బుక్‌లో ఉద్యోగంలో చేసేటప్పుడు తాను రాసుకున్న కథ ఇదని, దర్శకుడు కావాలనే కోరికతో చాలామందికి కథ వినిపించానని అన్నారు. కానీ తెలుగులో నలుగురు హీరోలు కలిసి ఎక్కడ నటిస్తారని నిరాశపరిచారని, కానీ నిర్మాత ఆనంద్ ప్రసాద్ కథ విని సపోర్టు అందించారని, ఈ సినిమా ఈ తరహా చిత్రాలకు నాంది పలుకుతుందని భావిస్తున్నానని అన్నారు. నిర్మాత ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ- త్వరలోనే సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల వివరాలను తెలియజేస్తామని, మార్చి మొదటినుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. ఈ చిత్రానికి నిర్మాత:వి.ఆనంద్ ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శ్రీరామ్ ఆదిత్య.