రానా రాకతో సీన్ మారింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రానా దగ్గుబాటి, తాప్సి ముఖ్యపాత్రల్లో ఇండియా-పాక్‌లమధ్య సముద్రంలో నడిచిన వాస్తవ యుద్ధ కథనం ఆధారంగా రూపొందిన చిత్రం ఘాజి. ఇండియన్ స్క్రీన్‌పై ఈ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో దీనిపై అందరికీ ఆసక్తి ఎక్కువైంది. ఈ చిత్రం ఈనెల 17న విడుదల అవుతున్న సందర్భంగా దర్శకుడు సంకల్ప్ రెడ్డి చెప్పిన విశేషాలు..
ఘాజి ఆలోచన
నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఇక్కడ నా చదువు పూర్తవగానే ఫైన్ ఆర్ట్స్‌లో ఎం.ఎస్ చేయడానికి యు.ఎస్ వెళ్లాను. అది అయిపోగానే సినిమాల్లోకి వచ్చాను. ఒకసారి నేను వైజాగ్ వెళ్లినపుడు అక్కడ ఈ సబ్‌మెరైన్‌ను చూశాను. అప్పుడే దీనిమీద, ఇండియన్ నేవీ మీద సినిమా తీద్దామని నిర్ణయించుకున్నాను. రీసెర్చ్ మొదలుపెట్టి పూర్తి చేశాను. సెట్ కూడా వేశాం. కానీ కుదరక పివిపి, మాటీవీ సంస్థవారిని సంప్రదించాను.
యుద్ధ అంశాలే
‘ఘాజి’ అనేది పాకిస్తాన్ జలాంతర్గామి. దీని గురించి చాలా కథలున్నాయి. వాటిలో ఒకటి ఇండియా కోణంలోనిదైతే, ఇంకొకటి పాకిస్తాన్ కోణంలోనిది. నేను ఇండియా కోణంలోని కథను తీసుకున్నాను. దానికి కమర్షియల్‌గా కొంత ఫిక్షన్ జోడించా. మొదట అందరూ కొత్తవాళ్లతో చేద్దామనుకున్నాను. కానీ రానా కథ గురించి విని ప్రాజెక్టులోకి వచ్చారు. ఆయన రాకతో చిత్ర స్థాయి మారిపోయింది. హిందీలో మాత్రమే తీయాలనుకున్న సినిమా ఇప్పుడు హిందీతోపాటు తెలుగులో కూడా రిలీజవుతోంది. పివిపి వలన తమిళంలో కూడా వస్తోంది.
రానా పాత్ర కోసం
నిజానికి రానా పాత్రకు 45 ఏళ్ళు ఉంటాయి. కానీ రానాకోసం దాన్ని యంగ్‌గా చేశాం. అప్పటికే స్క్రిప్ట్, స్టోరీ బోర్డ్, సిజి వర్క్ రెడీగా ఉండటంతో కేవలం 60 రోజుల్లో హిందీ, తెలుగు వెర్షన్లు షూట్ ముగించాం. ఈ సినిమాని కరణ్ జోహార్‌కు చూపించాం. చాలా సన్నివేశాలు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేకుండా తీశాం. అది చూసిన ఆయన సినిమాని ప్రమోట్ చేయాలనుకున్నారు 1971 నేవీకి చెందిన వ్యక్తులకు సినిమా స్పెషల్ షో వేశాం. వారంతా మెచ్చుకున్నారు.
భిన్నమైన సినిమాలే
పూర్తిగా భిన్నంగా ఉండే సినిమాలు తీయాలనే అనుకుంటున్నాను. నాకు సాధారణ సినిమాలు నచ్చవు. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్‌మీద రానటువంటి చిత్రాలు తీయాలని వుంది. ప్రస్తుతానికి ఘాజి రిలీజ్‌కోసం చూస్తున్నా. కొత్త దర్శకుడిగా నా సినిమా ఒకేసారి మూడు భాషల్లో రిలీజవడం గర్వంగా ఉంది. నా నెక్స్ట్ సినిమా గురించి త్వరలోనే చెబుతా.

-శ్రీ