పీకల్లోతు ప్రేమలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు సరసన హీరోయిన్‌గా ‘1 నేనొక్కడినే’ సినిమాలో నటించిన కృతిసనన్ ఈ మధ్య ఘాటు ప్రేమాయణం సాగిస్తోందంటూ బాలీవుడ్‌లో జోరుగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్‌తో ఈ అమ్మడి వ్యవహారం చాలా సీరియస్‌గానే ఉందట. ఇద్దరూ పీకలోతు ప్రేమలో మునిగిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కృతిసనన్, మహేష్ సినిమా తరువాత తెలుగులో చైతన్యతో ‘దోచేయ్’ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ అమ్మడికి టాలీవుడ్‌లో అవకాశాలు రాలేదు. హిందీలో షారుక్‌ఖాన్ సినిమాలో నటించిన కృతి ఆ తరువాత మరో సినిమాలో మాత్రమే కనిపించింది. ఆ సినిమాలో హీరోగా నటించిన సుశాంత్‌రాజ్‌తో ప్రేమలో పడింది. అప్పటినుండీ వీరి వ్యవహారం జోరుగా సాగుతోంది. పైగా ఇద్దరూ కలిసి సహజీవనం కూడా చేస్తున్నారట. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారో.. లేక మరెందుకో కానీ ఇద్దరు కలిసే ఉంటున్నారు. అయితే ఈ విషయంపై వీరిద్దరూ ఎలాంటి కామెంట్స్ చేయడంలేదు?