26న ఓ పిల్లా నీవల్ల..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కృష్ణచైతన్య, రాజేష్ రాథోడ్, షాలి, వౌనిక ప్రధాన తారాగణంగా బిగ్ విగ్ పతాకంపై కిశోర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఓ పిల్లా నీవల్ల’. ఈ చిత్రానికి సంబంధించిన పాత్రికేయుల సమావేశం హైదరాబాద్లో ఏర్పాటుచేశారు. దర్శక నిర్మాత ఎన్.శంకర్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- లండన్లో చదువుకొన్న కిశోర్, సినిమాపై వున్న పాషన్తో తన స్నేహితులతో ఈ సినిమా చేశాడని, యువ రక్తం ఉరకలేస్తే ఎలా వుంటుందో ఈ సినిమ అలా వుంటుందని, వైవిధ్యమైన స్క్రీన్ప్లే, యువతను ఆకట్టుకునే సన్నివేశాలు, సంగీతం బాగుంటుందని, ఈనెల 26న రెండు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారని తెలిపారు.
అనేక ఇబ్బందులను దాటుకొని రూపొందించిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందన్న నమ్మకం వుందని, రెండు ప్రేమ జంటలమధ్య అనుకోని సంఘటనలు ఎదురైతే ఎలా వుంటుందో తెలిపే కథాంశం ఈ సినిమాలో చర్చించామని, సంగీతం హైలెట్గా వుంటుందని కిశోర్ తెలిపారు. కార్యక్రమంలో జిత్తు సుదర్శన్, అశోక్, రాజేష్ రాధోడ్, సూర్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.