ప్రారంభమైన కరాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి కిరణ్‌రాజ్ కథానాయకుడిగా ఎం.జె.మోషన్ పిక్చర్స్ పతాకంపై కిరణ్ కోటప్రోలు దర్శకత్వంలో మల్లికార్జున్‌రెడ్డి, మహమ్మద్ జాఫర్ అలీ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘కరాళి’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవం హైదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. కెమెరామెన్ సెంథిల్ క్లాప్‌నివ్వగా, దర్శకుడు వీరశంకర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కిరణ్ మాట్లాడుతూ- వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, బాహుబలిలో ప్రభాస్‌కు డబల్ యాక్టర్‌గా పనిచేసిన కిరణ్ హీరోగా నిర్మిస్తున్నామని, సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని, ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తామని తెలిపారు. కిరణ్ చెప్పిన కథ వైవిధ్యంగా వుండడంతో తాను ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ఈనెలాఖరునుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నదని నిర్మాతలు తెలిపారు. కథ అద్భుతంగా ఉంటుందని, అందుకే తాను కథానాయకుడిగా నటించడానికి వెనుకాడలేదని హీరో కిరణ్‌రాజ్ అన్నారు. కార్యక్రమంలో అంబర్‌పేట శంకర్, నటుడు రాజేంద్ర, శ్యామల తదితరులు పాల్గొన్నారు.