సినారె చివరిపాటతో మనసైనోడు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 15 June 2017
మనోజ్ నందన్, ప్రియాసింగ్ జంటగా సత్యవరపు వెంకటేశ్వరరావు దర్శకత్వంలో హసీబుద్దిన్ రూపొందిస్తున్న చిత్రం ‘మనసైనోడు’. ఈ చిత్రానికి మహాకవి సినారె చివరి పాట రాయడం విశేషం. ‘‘జయ జయ హే భారతావని పావని సద్గుణ గణ సముపేతా’’ అన్న పాటను ఆయన భారతదేశపు గొప్పతనాన్ని ప్రతి భారతీయుడు తెలుసుకొని గర్వంగా తల ఎత్తుకుని పాడుకునే విధంగా రచించారని, ఇదో గొప్ప దేశభక్తి గీతం అవుతుందని నిర్మాత హసీబుద్దిన్ అన్నారు. ఇంత గొప్ప పాట తమ సినిమాలో రాసిన ఆయన లేకపోవడం బాధగా ఉందని, ఈ చిత్రం ఆయనకే అంకితం ఇస్తున్నామని ఆయన తెలిపారు.