వీరభోగ వసంతరాయలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2016 చివరలో విడుదలై సినీ ప్రేక్షకుల్ని, విమర్శకులని సైతం మనసుతో కంట తడి పెట్టించిన వినూత్న కథా చిత్రం ‘అప్పట్లో ఒకడుండేవాడు’. ఈ చిత్రంలో నారా రోహిత్, శ్రీవిష్ణు కలయిక మర్చిపోలేని విధంగా నిలిచిపోయింది. ఇలాంటి వైవిధ్యమైన చిత్రాలతో ఎప్పుడూ ప్రేక్షకుల్ని ఆలరించే దిశగా తమ సినీ ప్రయాణం సాగిస్తున్న వీరిద్దరి కాంబినేషన్‌లో నటిస్తున్న చిత్రం ‘వీర భోగ వసంతరాయలు’. ఈ చిత్రాన్ని రామోజీ ఫిల్మ్‌సిటీలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. ఈ చిత్రాన్ని బాబా క్రియేషన్స్ పతాకంపై, ఎం.వి.కె.రెడ్డి సమర్పణలో అప్పారావు బెల్లన నిర్మిస్తున్నారు. ఇంద్రసేన.ఆర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీయా శరణ్ మరో ముఖ్యపాత్రలో నటిస్తుండగా.. సుధీర్‌బాబు ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత అప్పారావు బెల్లన మాట్లాడుతూ.. ‘ఇంద్రసేన నాకు చాలా మంచి మిత్రుడు. ఎప్పటికప్పుడు కమర్షియాలిటీ మిస్ కాకుండా వైవిధ్యమైన కథలు, పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరించే రోహిత్, శ్రీవిష్ణు చేస్తున్నందుకు ఈ ప్రాజెక్టుమీద మాకు రెస్పాన్సిబిలిటీ మరింత పెరిగింది. శ్రీయ కథ విని చాలా ఎగ్జైట్ అయ్యి అంగీకరించారు. అలాగే సుధీర్‌బాబుని తీసుకున్నాము. ఈ నాలుగు పాత్రలు, వీరి పాత్రల తీరు ఖచ్చితంగా ఇప్పటివరకు ఏ చిత్రంలో ఎవరూ చెయ్యని విధంగా దర్శకుడు ఇంద్రసేన తీర్చిదిద్దాడు అని’ అన్నారు.