ప్రతిక్షణం అనుభూతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీష్‌బాబు, తేజస్విని జంటగా శ్రీ భాగ్యలక్ష్మి మూవీ మేకర్స్ పతాకంపై నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో జి మల్లికార్జున్‌రెడ్డి రూపొందించిన చిత్రం ‘ప్రతిక్షణం’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని 18న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో ప్రీ రిలీజ్ వేడుకతోపాటు ప్లాటినమ్ డిస్క్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ము ఖ్య అతిథి తుమ్మలాపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ పాటలు, ట్రైలర్లు అభిరుచితో తీర్చిదిద్దారని అర్థమైందని అన్నా రు. 80 నుంచి 100 థియేటర్‌లలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. ప్రేక్షకులకు థ్రిల్ కలిగించేలా చిత్రంగా రూపొందించినట్టు నిర్మాత మల్లిఖార్జున రెడ్డి తెలిపారు. రఘురామ్ అందించిన సంగీతానికి మంచి స్పందన లభించిందని, సినిమా పేరులాగే ప్రతి సన్నివేశం కొత్తరకమైన అనుభూతిని ప్రేక్షుకలకు ఖచ్చితంగా అందిస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. హారర్ చిత్రాల్లో ఓ వైవిధ్యమైన సినిమాగా గుర్తింపు సినిమాకు వస్తుందని హీరో మనీష్‌బాబు తెలిపారు. కార్యక్రమంలో మల్కాపురం శివకుమార్, అమృతరావు, ఎన్ పద్మిని, దేవారెడ్డి, ఓమ్‌నాధ్‌రెడ్డి, రవిచంద్ర, రాజ్‌కందుకూరి, సాయివెంకట్ తదితరులు పాల్గొన్నారు. అర్చన, విజయ్‌సాయి, వైవా హర్ష, సుదర్శన్‌రెడ్డి తదితరులు నటించిన చిత్రానికి కెమెరా కళ్యాణ్ సమి, సంగీతం రఘురామ్.