ఆటగాళ్లు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న సరికొత్త చిత్రం ‘ఆటగాళ్లు’. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్రలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్, జగపతిబాబులు టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. ఈ ఇంటిలిజెంట్ థ్రిల్లర్‌కి ‘గేమ్ విత్ లైఫ్’ అనేది ట్యాగ్ లైను. ఈ చిత్ర ప్రారంభోత్సవం బుధవారం రామానాయుడు స్టూడియోలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. నారా రోహిత్ - జగపతిబాబులపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి శేఖర్ కమ్ముల క్లాప్‌నివ్వగా, దిల్‌రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. నారా రోహిత్ మాట్లాడుతూ- తొలిసారి జగపతిబాబుతో కలిసి చేస్తున్నాను. మా ఇద్దరి వాయిస్‌లు చాలా ప్రత్యేకంగా వుంటాయి. మా ఇద్దరి గొంతులను వినాలని వుంది. విజయ్ సి.కుమార్‌తో నేను చేస్తున్న రెండో చిత్రమిది. సాయి కార్తీక్‌తో ఏడో సినిమాకు పనిచేస్తున్నాను. ఇదొక డిఫరెంట్, ఎక్స్‌పరిమెంట్, కమర్షియల్ సినిమా. షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని వెయిట్ చేస్తున్నాను. ఇద్దరు తెలివైన వాళ్లమధ్య జరిగే కథ ఇది అన్నారు. జగపతిబాబు మాట్లాడుతూ- టైటిల్ చాలా బావుంది. గేమ్ విత్ లైఫ్ అని ఉప శీర్షిక పెట్టాం. పెదబాబు నుంచి నాకు మురళి అంటే ఇష్టం,. ఆ సినిమాలో పాటలు, కామెడీ, సీరియస్‌నెస్ వుంటుంది. ఇంకా పెద్ద హిట్ కావాల్సింది. దాన్ని మించిన సినిమా తీయమని మురళితో చెబుతుంటాను. ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా దాన్ని మించిన సినిమా అవుతుంది. నేను, రోహిత్‌తోపాటు ఇంకో ఇద్దరు కూడా ఉంటారు. నేను, రోహిత్ డబ్బింగ్‌లో ఆడుకుంటాం అన్నారు. దర్శకుడు పరుచూరి మురళి మాట్లాడుతూ- కథ నచ్చి ఇద్దరు హీరోలు నటించడానికి అంగీకరించారు. వారిద్దరి గొంతులు చాలా బావుంటాయి. నారా రోహిత్ ఇలాంటి కథను ఒప్పుకోవడంవల్ల భవిష్యత్తులో మరిన్ని కొత్త కథలు వస్తాయి. చాలా వైవిధ్యమైన సినిమా ఇది. మంచి కామెడీ కూడా ఉంటుంది. కెమెరామెన్ విజయ్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఇందులో కామెడీతోపాటు అన్ని అంశాలు పుష్కలంగా వుంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: గోపి, కెమెరా: విజయ్ సి.కుమార్, సంగీతం: సాయికార్తీక్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: ఆర్.కె.రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.సీతారామరాజు, నిర్మాతలు: వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పరుచూరి మురళి.