పాటల్లో ఉన్నది జిందగీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్, అనుపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవికిశోర్, పి.ఆర్. సినిమాస్ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై కృష్ణచైతన్య నిర్మిస్తున్న ‘ఉన్నది ఒకటే జిందగీ..’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో దర్శకుడు కిశోర్ తిరుమల మాట్లాడుతూ- నిర్మాతగా కృష్ణచైతన్య చేస్తున్న తొలి సినిమా ఇది. తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది. రవికిశోర్ ఆలోచనలు, మా ఆలోచనలు ఒకేలా వుంటాయి. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకం ‘నేను శైలజ’ సినిమా. మరో గట్టి నమ్మకం ఈ చిత్రం. సినిమా అద్భుతంగా వచ్చింది. ప్రతి పాత్రను ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారు. ముఖ్యంగా అనుపమా పరమేశ్వరన్ మహా పాత్రలో ఆకట్టుకుంటుంది. ఒక పాత్రను ఎలాగైనా రాయొచ్చని రామ్ నిరూపించారు. అద్భుతమైన నటనతో నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు అన్నారు. లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ- చాలా రోజుల తరువాత మంచి పాత్ర చేశాను అన్నారు. హీరో రామ్ మాట్లాడుతూ- నా హృదయానికి దగ్గరైన సినిమా ఇది. దేవిశ్రీ, సమీర్‌రెడ్డి, పెద్దనాన్న, దర్శకుడు కిశోర్ సినిమాకు నాలుగు స్తంభాలుగా నిలబడ్డారు. దేవి అద్భుతమైన పాటలు ఇచ్చాడు. నేను ఇండస్ట్రీకి ఎందుకొచ్చానో ఈ సినిమాతో అర్థమైంది. ఈ నెల 27న మీ ముందుకు వస్తున్నాం. తప్పకుండా మీకు నచ్చుతుంది అన్నారు.