నాగార్జున, నానిల మల్టీస్టారర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథాబలం వున్న చిత్రాలకు, వెండితెరపై భారీతనం కురిపించిన సినిమాలకు, స్టార్ వాల్యూ, మేకింగ్ వాల్యూల అరుదైన కలయికకు కేరాఫ్ అడ్రస్ వైజయంతీ మూవీస్ సంస్థ. ఈ బ్యానర్ నుంచి వచ్చిన చిత్రాలెన్నో తెలుగువారి హృదయాల్ని గెలుచుకుని మరపురాని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఇప్పుడు వైజయంతీ మళ్లీ పునఃవైభవం సాధించే దిశగా అడుగులేస్తోంది. వరుసగా సినిమాల్ని తెరకెక్కించే పనిలో నిమగ్నమైంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజుతో కలిసి సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది వైజయంతీ మూవీస్. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టు తెలుగు ప్రేక్షకుల్ని అలరించడానికి ఈ సంస్థ సిద్ధమైంది. కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నానిలతో త్వరలోనే ఓ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టబోతోంది. భలే మంచిరోజు, శమంతకమణి లాంటి వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జనవరిలో సెట్స్‌మీదకు వెళ్లబోతోంది. ఈ సందర్భంగా అశ్వనీదత్ మాట్లాడుతూ- నాగార్జున, నానిలతో మల్టీస్టారర్ తెరకెక్కించడం ఎంతో ఆనందంగా వుంది. ఈ ఇద్దరితో వైజయంతి మూవీస్‌కి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మా సంస్థలో అత్యధిక చిత్రాల్లో నటించిన కథానాయకుడు నాగార్జున. ఆయనతో ఇది మా ఐదవ చిత్రం. గత చిత్రాలకంటే గొప్పగా, అత్యున్నత సాంకేతిక విలులతో ఈ సినిమాని రూపొందిస్తామన్నారు. ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేసే పనిలో ఉన్నాం. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం అన్నారు.