12న ‘జై సింహా’ వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణ, నయనతార, నటాషా జోషి, హరిప్రియ ప్రధాన పాత్రదారులుగా కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జై సింహా’. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా దుబాయ్ షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో బాలకృష్ణ-నయనతారపై ఒక పాట, బాలయ్య-నటాషా జోపీపై మరో గీతం చిత్రీకరించారు. దీంతో కీలకమైన దుబాయ్ షెడ్యూల్ మొత్తం పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ- ‘దుబాయ్‌లో 30 మంది యూరోపియన్ డ్యాన్సర్స్‌తో బాలయ్య-నటాషాల మధ్య యుగళగీతం జానీ మాస్టర్ నేతృత్వంలో, మరో 20 మంది యూరోపియన్ డ్యాన్సర్స్‌తో బాలయ్య-నయనతారలపై మరో లలీసాంగ్‌ను బృంద మాస్టర్ నేతృత్వంలో ఎంతో లావిష్‌గా చిత్రీకరించాం. డిసెంబర్ నెలాఖరు వరకు చిరంతన్ భట్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలను భారీ వేడుక నిర్వహించి విడుదల చేయనున్నాం. జనవరి 12న బాలయ్య అభిమానులకు సంక్రాంతి కానుకగా ‘జై సింహా’ చిత్రాన్ని విడుదల చేయనున్నాం. ‘జై సింహా’గా బాలయ్య ఎనర్జిక్ పెర్ఫార్మెన్స్, కె.ఎస్.రవికుమార్ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది’ చెప్పారు. బాలకృష్ట, నయనతార, నటాషా జోషి, హరిప్రియ, బ్రహ్మానందం, ప్రకాష్‌రాజ్, అశుతోష్ రాణా, మురళీమోహన్, జయప్రకాష్‌రెడ్డి, ప్రభాకర్, శివపార్వతి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్: అంబరీష్, రామ్-లక్ష్మణ్, వెంకట్, కెమెరా: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహనిర్మాత: సి.వి.రావు, కార్య నిర్వాహక నిర్మాతలు: వరుణ్-తేజ, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్.