విషయం వుంది కాబట్టే సినిమా తీశా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్‌కిషన్, అమైదా దస్తూర్, త్రిధా చౌదరి హీరో హీరోయిన్లుగా మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్లపై పి.కిరణ్, సంజయ్ స్వరూప్ నిర్మించిన ‘మనసుకు నచ్చింది’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ చిత్రంలోని పాటలను జర్నలిస్టులు విడుదల చేశారు. అనంతరం దర్శకురాలు మంజుల మాట్లాడుతూ- నేను ఇండస్ట్రీలోనే పుట్టాను. ఇండస్ట్రీ మనిషిని. ఎంతోమంది దర్శకనిర్మాతలను చూశాను. ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటి నేను ఏదో ఒక సినిమా చేయాలని ఈ చిత్రాన్ని తీయలేదు. అలాంటి అవసరం నాకు లేదు. ఈ సినిమా తీశానంటే ఖచ్చితంగా ఏదో ఒక విషయం వుంటుంది. మంచి సినిమా అవుతుంది. నేను ఎందుకు సినిమా తీశానన్నది సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇప్పటివరకూ ఎన్నో ప్రేమకథలు చూశారు. అలాంటి కథల్లో ఇది ఒక మంచి సినిమా అవుతుంది. మా పాప జాన్వి కూడా ఓ పాత్ర పోషించింది. సందీప్, అమైరాలు అద్భుతంగా నటించారు. నిర్మాత కూడా ఎంతో సపోర్టు అందించారు. నేను డైరెక్షన్ చేశానంటే మహేష్ ఇప్పటికీ నమ్మడు. పాటలు, ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయ్యాడు. అలాగే పవన్‌కళ్యాణ్‌తో సినిమా చేయడానికి నాదగ్గర ఒక అద్భుతమైన కథ వుంది. ఆయన వింటే తప్పకుండా చేస్తారు అన్నారు. హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ- ఫన్ అండ్ స్వీట్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మంచి కాఫీ లాంటి సినిమా ఇది. యూత్‌తోపాటు ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రం అన్నారు.