‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడితో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న ‘్భరత్ అనే నేను’ షూటింగ్ పూర్తి కావచ్చింది. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మహేష్ వంశీ పైడిపల్లితో సినిమా చేయనున్నాడు. తాజాగా మరో దర్శకుడికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో తెలుసా... ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో సంచలనం రేపిన సందీప్ వంగ? ఇదివరకే మహేష్‌కి సందీప్ కథ చెప్పాడట. పాయింట్ బాగా నచ్చడంతో మహేష్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పాడట. ఈ సినిమాలో మహేష్ కారు మెకానిక్‌గా కనిపిస్తాడని.. రా సినిమాగా ఇది తెరకెక్కనుందట. వంశీ పైడిపల్లి తరువాత తదుపరి సినిమా సందీప్‌తోనే ఉంటుందట.