రెండో షెడ్యూల్‌లో ‘నివాసి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట’ లాంటి మంచి చిత్రంలో నటించి అందరి హృదయాల్లో నటుడిగా మంచి స్థానం సంపాదించిన శేఖర్‌వర్మ హీరోగా, వివియ, విద్యలు హీరోయిన్స్‌గా, సతీష్ రేగళ్ళని దర్శకుడుగా పరిచయం చేస్తూ గాయత్రి ప్రొడక్షన్స్, దత్తాత్రేయా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌లో కె.ఎన్.రావు, టి.వి.వి.ఎస్.ఎన్.వర్మలు నిర్మాతలుగా సంయుక్తంగా నిర్మిస్తున్నచిత్రంనివాసి. ఇప్పటికే 75శాతం షూటింగ్‌ని పూర్తి చేసుకున్నారు. ఇది ఒక ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది. ట్రావెల్ బేస్డ్ స్టోరీ. చరణ్-అర్జున్ సంగీత దర్శకులు. రెండు పాటలు, క్లైమాక్స్ మినహా మొత్తం చిత్రం పూర్తయింది. త్వరలో పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా దర్శకుడు సతీష్ రేగళ్ళ మాట్లాడుతూ.. శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట సినిమా చూశాను. ఆ సినిమాలో శేఖర్‌వర్మ చాలా ఎమోషన్‌గా వుండే పాత్ర. అదీ కాకుండా చాలా చక్కగా నటించి అందర్నీ మెప్పించాడు. ఆ తరువాత నందమూరి బాలకృష్ణ నటించిన జయసింహ చిత్రంలో చాలా చక్కటి పాత్రలో నటించి మెప్పించారు. చాలా చక్కటి ఎంటర్‌టైనర్‌గా మంచి ఫ్యామిలీ ఎమోషన్‌తో కూడిన థ్రిల్ కూడా ప్రేక్షకులు ఫీలయ్యేలా కథనం వుంటుంది. నిర్మాతలు కె.ఎన్.రావుగారు, వర్మగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని తెరకెక్కించడంలో సహాయాన్ని అందిస్తున్నారు. క్లైమాక్స్, 2 పాటలు మినహా సినిమా పూర్తయింది. ఇటీవల మేము విడుదల చేసిన మొదటి లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ రావటం మాకు చాలా ఆనందాన్నిచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదలకి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.