కల్యాణ్‌రామ్ కొత్త చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి కల్యాణ్‌రామ్, నివేదా థామస్, షాలినీ పాండే హీరో హీరోయిన్లుగా ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కొత్త చిత్రం బుధవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. కె.వి.గుహన్ దర్శకత్వంలో మహేశ్ కోనేరు సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి ఎన్టీఆర్ క్లాప్‌నివ్వగా నందమూరి హరికృష్ణ కెమెరా స్విచ్చాన్ చేశారు. నందమూరి రామకృష్ణ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు కె.వి.గుహన్ మాట్లాడుతూ- కల్యాణ్ హీరోగా మహేశ్ కోనేరు నిర్మాణంలో సినిమా చేయడం ఆనందంగా వుంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది అన్నారు. నిర్మాత మహేశ్ కోనేరు మాట్లాడుతూ- కల్యాణ్‌రామ్‌తో మా బ్యానర్‌లో ‘నా నువ్వే’ సినిమా చేశాం. అది త్వరలోనే విడుదల కానుంది. ఆ సినిమా విడుదలయ్యేలోపు కల్యాణ్‌తో రెండో సినిమా ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. గుహన్ చెప్పిన స్క్రిప్ట్ మాకు నచ్చింది. మే 2 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు శేఖర్ చంద్రగారు మంచి సంగీతాన్ని అందిస్తారనే సంగతి తెలిసిందే. ఇప్పుడు మా సినిమాకు సంగీతం అందిస్తుండడం హ్యాపీగా ఉంది అన్నారు. షాలినీ పాండే మాట్లాడుతూ తెలుగులో నా రెండో సినిమా ఇది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది అన్నారు. నివేదా థామస్ మాట్లాడుతూ- గుహన్ స్క్రిప్ట్‌ను తమిళంలో వినిపించారు. తెలుగు సినిమాలకు ఆరు నెలలుగా దూరంగా ఉన్నాను. నిర్మాత మహేశ్‌తో చాలాకాలంగా అనుబంధం ఉంది. ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది అన్నారు. శేఖర్ చంద్ర మాట్లాడుతూ- సస్పెన్స్ థ్రిల్లర్.. మంచి మ్యూజిక్ స్కోప్ ఉన్న సినిమా అన్నారు.