18నగీతాపురి కాలనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరేన్, శ్రవణ్, పార్థు, దుష్యంత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గీతాపురికాలనీ’. గరలకంఠ మద్దేటి శ్రీనివాస్ దర్శకుడు. జి.రామకృష్ణ నిర్మాత. రామ్‌చరణ్ స్వరాలను సమకూర్చిన ఈ చిత్ర గీతాలు ఇటీవల విడుదలయ్యాయి. అన్ని కార్యమ్రాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 18న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత జి.రామకృష్ణ మాట్లాడుతూ- ‘‘కథ బాగా నచ్చడంతో ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మించాను. ఐదుగురు పిల్లల నేపథ్యంలో జరిగే కథ ఇది. ఇందులో మా అబ్బాయి కూడా ఒక క్యారెక్టర్ చేసాడు. విద్య విలువ గురించి చెప్పే చిత్రమిది. ఈనెల 18న విడుదల చేస్తున్నాం. ఈ సినిమాకు కచ్చితంగా అవార్డ్స్ వస్తాయన్న నమ్మకం ఉంది’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. ‘ఐదు కథల సమాహారంగా సాగే చిత్రమిది. తెరపై పాత్రలే తప్ప నటులు కనిపించరు. గీతాపురికాలనీలో ఏం జరిగిందనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తిని కలిగిస్తుంది. మాకు సపోర్ట్‌చేసిన రాంకీగారికి ధన్యవాదాలు. పిల్లల సినిమాలు తక్కువైపోతున్న సమయంలో ఇలాంటి బాలల సినిమాతీసాం. అవార్డ్స్‌కోసం పంపిస్తున్నాం. ఈనెల 18న రిలీజ్ చేస్తాం’’ అన్నారు. దుష్యంత్‌కుమార్ మాట్లాడుతూ- ‘‘పిల్లలతో చదువుకోవాలనే ఆసక్తి ఎలాంటి మలుపు దారితీసింది అనే కానె్సప్ట్‌తో సినిమాతీసాం. నేను కోప్రొడ్యూసర్‌గా చేస్తూ ఇందులో ఇంపార్టెంట్ పాత్రని పోషించాను’’ అన్నారు. సంగీత దర్శకుడు రామ్‌చరణ్ మాట్లాడుతూ- ‘‘ఇందులో ఆరు పాటలు నేనే రాసి, కంపోజ్ చేశాను. పాటలకు రెస్పాన్స్ బావుంది’’ అన్నారు. నరేన్, శ్రావణ్, పార్థు, శ్రీహుత్, ప్రజ్ఞ, దుష్యంత్‌కుమార్, రమణి, శ్రీను కేసబోయిన, శ్రీహరి, ప్రతిమ, అంబిక, ముక్రం, జలాల్ మహ్మద్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: నందకిషోర్, కెమెరా: మహేష్ మట్టి, ఆర్ట్: పి.జీవన్, కో-డైరెక్టర్: కత్తి, పోస్టర్ డిజైన్: ధీరజ్ ఆర్ట్స్, నిర్మాత: జి.రామకృష్ణ, దర్శకత్వం: గరలకంఠ మద్దేటి శ్రీనివాస్.