వణికించే బెంగాల్ టైగర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవితేజ, తమన్నా, రాశీఖన్నా ప్రధాన తారాగణంగా సంపత్‌నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బెంగాల్ టైగర్’. కె.కె.రాధామోహన్ రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో గతంలో విడుదలైంది. ఈ పాటలకు ప్లాటినమ్ డిస్క్ లభించిన సందర్భంగా హైదరాబాద్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కథానాయకుడు రవితేజ మాట్లాడుతూ, సంగీత దర్శకుడు మంచి బాణీలను అందించడంతో పాటలు హిట్ అయ్యాయని, దర్శకుడు సంపత్‌కు హ్యాట్రిక్ విజయం అందుకుంటాడని తెలిపారు. సినిమా పాటలను ఇంత పెద్దగా విజయవంతం చేసిన రెండు రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని, అన్ని మసాలాలు వున్న ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందిందని దర్శకుడు సంపత్‌నంది తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 10న విడుదల చేయనున్నామని, బాక్సాఫీస్‌ను కలెక్షన్లతో వణికిస్తుందని ఆయన అన్నారు. ఆడియో ఎంత గొప్పగా విడుదలైందో సినిమా కూడా అంత బాగా విజయవంతం అవుతుందన్న నమ్మకం వుందని సంగీత దర్శకుడు భీమ్స్, నిర్మాత రాధామోహన్, తమన్నా, రాశీఖన్నా అన్నారు. కార్యక్రమంలో రామజోగయ్య శాస్ర్తీ, మల్టీ డైమెన్షన్ వాసు, రామ్‌లక్ష్మణ్, భాస్కర్‌భట్ల తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి నిర్మాత: కె.కె.రాధామోహన్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్ నంది.