క్రైమ్/లీగల్

విద్యుదాఘాతానికి తండ్రీకొడుకుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్కువ, జూన్ 8: విద్యుదాఘాతానికి తండ్రీ కొడుకులు మృ త్యుఒడికి చేరడం తో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నా యి. ఎస్‌ఐ కృష్ణ ప్రసాద్ అందించిన వివరాల ప్రకారం.. మక్కువ మండలం పాపయ్యవలస గ్రామానికి చెందిన వై.శ్రీనివాసరావు(35) అతని భార్య వేణు, కుమారుడు సాయికుమార్(13), కుమార్తె అమృత కొంతకాలం క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. కాగా ఇటీవల సాయికుమార్ తిరిగి పాపయ్యవలస గ్రామానికి వచ్చాడు. పాఠశాలలు ప్రారంభం కావడంతో బొబ్బిలిలో పాఠశాలలో చేర్పించేందుకు సాయికుమార్ తండ్రి శ్రీనివాసరావు హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఈమేరకు సాయికుమార్ శుక్రవారం స్నానం చేసేందుకు ఇంటివద్ద మోటార్‌ను ఆన్ చేశాడు. మోటారుకు ఏర్పాటు చేసిన పైపును పట్టుకుని నీళ్లుపోసుకుంటుండగా మోటార్‌పై వాటర్ పడటంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్నానానికి వెళ్లిన కొడుకు తిరిగి రాకపోవడంతో తండ్రి శ్రీనివాసరావు వెళ్లి చూడగా మోటార్‌వద్ద కుమారుడు పడి ఉన్నాడు. దీంతో ఆతృతగా వెళ్లి కుమారుడ్ని పట్టుకోవడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో బంధువులు తండ్రీకొడుకులను ఆసుపత్రికి తీసుకువెళ్లినప్పటికీ ప్రయోజనం చేకూరలేదు. పాఠశాలకు వెళ్లాల్సిన సాయికుమార్, తండ్రి శ్రీనివాసరావు మృత్యుఒడికి చేరడంతో కుటుంబీకులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. శ్రీనివాసరావు తండ్రి జగన్నాథం, మేనత్త బంగారమ్మ స్పృహకోల్పోయారు. తల్లిదండ్రులను చూసేందుకు, కొడుకును పాఠశాలలో చేర్పించేందుకు వచ్చిన శ్రీనివాసరావు అనంతలోకాలకు చేరడంతో గ్రామస్థులలో విషాదం నెలకొంది. కాగా హైదరాబాద్ నుంచి భార్య వేణు, కుమార్తె అమృత రావల్సి ఉంది. మృతదేహాలకు పంచనామా జరిపి పోస్టుమార్టం నిమిత్తం సాలూరు సిహెచ్‌సీకి తరలించారు. ఈమేరకు ఎస్‌ఐ కృష్ణప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.