20 నుంచి మిస్టర్ మజ్ను?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని చిన్నోడు అఖిల్ హీరోగా నటించే మూడవ సినిమాకు రంగం సిద్ధమైంది. తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం ఈనెల 20న ప్రారంభం కానున్నదట. షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో జరగనుంది. నిజానికి ఈనెల మొదటివారంలోనే ప్రారంభం కావాల్సి వుండగా వీసా ప్రాబ్లమ్‌వల్ల వాయిదా పడింది. ఈ షెడ్యూల్‌లోనే దాదాపు 70 శాతంపైగా షూటింగ్ పూర్తి చేస్తారట. అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న ఈ చిత్రానికి మిస్టర్ మజ్ను అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.