రెండో పాటలో..పంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్, మెహరీన్ జంటగా కె.చక్రవర్తి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘పంతం’. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని రెండో పాటను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా గాయకుడు గద్దర్‌తోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ- గోపీచంద్ నటించిన పంతం చిత్రానికి గోపీసుందర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. పాటలు బాగున్నాయి. గోపీచంద్ మంచి టాలెంట్ వున్న నటుడు. తప్పకుండా ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకుంటాడు. నిర్మాత రాధామోహన్ సినిమాలంటే పాషన్ వున్న వ్యక్తి జూలై 5న విడుదలయ్యే ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాన్నారు. గద్దర్ మాట్లాడుతూ- సినిమా రంగం చాలా గొప్పది. గోపీచంద్ నటించిన పంతం సినిమా విజయవంతం కావాలి అన్నారు. నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ- మా బ్యానర్‌లో గోపీచంద్ నటిస్తున్న మొదటి సినిమా. చాలా ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాం. గోపీసుందర్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చాడు. రెండో పాటను మంత్రి తలసాని విడుదల చేయడం ఆనందంగా ఉంది అన్నారు.