తెరపై యామిని బయోపిక్ -- దర్శకుడు గిరిధర్ గోపాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో ‘దివ్యమణి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన గిరిధర్ గోపాల్, తన తదుపరి చిత్రంగా ప్రముఖ నాట్యమణి పద్మశ్రీ యామిని కృష్ణమూర్తి జీవిత కథను ఆధారంగాచేసుకొని బయోపిక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు డైరెక్టర్ గిరిధర్ గోపాల్. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటిస్తూ.. ‘నా మొదటి చిత్రం ‘దివ్యమణి’ని ప్రేక్షకులు ఆదరించినందుకు మొదటగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ సినిమాను చూసిన వారందరూ బాగా మెచ్చుకున్నారు. నెగటివ్‌గా ఎవరూ చెప్పలేదు. ఇక నా గురించి చెప్పాలంటే విశ్వనాథ్‌గారు, డైరెక్టర్ లక్ష్మీదీపక్‌గారి దగ్గర, మరియు కెమెరామెన్ సత్తిబాబుగారి దగ్గర వర్క్‌నేర్చుకున్నాను. ఫొటోగ్రఫీ, మ్యూజిక్, విఎఫ్‌ఎక్స్‌లపై నాకు మంచి పట్టుఉంది. చాలా యాడ్స్‌కు పనిచేశాను. ఆ సమయంలోనే దివ్యమణి సినిమాకు దర్శకత్వం వహించాను. ఇప్పుడు నా రెండవ చిత్రంగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నాట్య కళాకారిణి పద్మశ్రీ యామిని కృష్ణమూర్తిగారి బయోపిక్‌ను తెరకెక్కించనున్నాం. ఆవిడ నేటితరానికి ఎంతో ఇన్స్‌స్పిరేషన్... కూచిపూడి, భరతనాట్యంలో తాను సాధించిన ప్రావీణ్యం ప్రపంచవ్యాప్తంగా తెలిసిందే.. అతి చిన్నవయసులోనే తనకు పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ లాంటి ఎన్నో అవార్డ్స్ అందివచ్చాయి. అలాంటి మహోత్తరమైన యామినిగారి జీవితకథను అందరికీ తెలియచేయాలనే ఉద్దేశ్యంతో ఎంతో రీసెర్చ్‌చేసి, అన్నీ టెక్నికల్ అంశాలపై సాధనచేసిన తరువాతే సినిమాగా రూపొందించాలని నిర్ణయం తీసుకున్నాను. ఇక ఈ చిత్ర కాస్టింగ్ విషయానికివస్తే.. బాలీవుడ్, కోలీవుడ్‌కు సంబంధించిన ప్రముఖ నటీనటులను పరిశీలిస్తున్నాం. యామినిగారే తన బయోపిక్‌కు కొరియోగ్రఫీ అందించనుండటం విశేషం.. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఇంటర్నేషనల్ లెవెల్‌లో తెరకెక్కించనున్నాం. బేసిక్‌గా నాకు సాహిత్యం అంటే చాలా ఇష్టం. కనుక నేనే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసి, నిర్మాతగాకూడా వ్యవహరిస్తున్నా. 10 నుంచి 20రోజుల్లో ఈ బయోపిక్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తాం’’ అని అన్నారు.