కొత్త దర్శకుడితో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఇటీవల ‘తేజ్ ఐ లవ్ యు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక వరుస పరాజయాలతో సతమతమవుతున్న తేజు ఈ సినిమాతోనైనా విజయం సాధించి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడనుకుంటే ఈ చిత్రం కూడా పూర్తిగా నిరాశపరిచింది. ఇక ఈ చిత్ర పరాజయంతో రెండు హ్యాట్రిక్‌లను తన ఖాతాలో వేసుకున్న ఆయన తన తరువాతి చిత్రాన్ని ‘నేను శైలజ’ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా ప్రారంభం కాకముందే తేజు మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. నూతన దర్శకుడు గోపాల్ చెప్పిన కథ నచ్చి కొత్త చిత్రానికి కమిట్ అయ్యాడట తేజు. ఈ చిత్రానికి ‘్భగవద్గీత సాక్షిగా’ అనే టైటిల్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమా గురించి క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.