తారలు దిగివచ్చిన వేళ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ జంటగా నటించిన ‘సమ్మోహనం’ చిత్రం క్లైమాక్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో తనికెళ్ల భరణి ‘తారలు దిగివచ్చిన వేళ’ అంటూ.. అందులోని ఓ బుజ్జి కథను చదువుతారు. ఆ కథలో సినిమా కథ అంతర్లీనంగా ఉంటుంది. ఆ సినిమా విడుదలైనప్పటినుంచి ‘తారలు దిగి వచ్చినవేళ’ పుస్తకం కానె్సప్ట్ బావుందని పలువురు మెచ్చుకుంటున్నారు. ఆ పుస్తకం కాపీ కావాలని ఇంకొందరు చిత్ర దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటిని అడిగారు. దాంతో మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ విషయాన్ని ఆలోచించారు. క్లైమాక్స్‌లో చూపించిన పుస్తకాన్ని ప్రచురించారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణికి ఓ ప్రచురణ సంస్థ ఉంటుంది. ‘అనగనగా’అని. అదే పేరుతో మోహనకృష్ణ ఇంద్రగంటి కూడా ఓ ప్రచురణ సంస్థను మొదలుపెట్టి తొలి ప్రచురణగా ‘తారలు దిగివచ్చిన వేళ’ను ప్రచురించారు. ఆమధ్య ఈ పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. తాజాగా ఈ పుస్తకాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. తొలి కాపీని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ తనయ సితార అందుకున్నారు. ఈ పుస్తకం గురించి మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ.. ‘తారలు దిగి వచ్చినవేళ...’, ‘సమ్మోహనం’ చిత్ర పతాక సన్నివేశాలు ఎలా ఉండాలా? అని మధనపడుతుండగా వచ్చిన ఆలోచన. సినిమా రంగం పట్ల చిన్నచూపు ఉన్న చిత్రకారుడు, అనుకోకుండా ఆ రంగానికే చెందిన ఒక నటిని ముందు గాఢంగా ప్రేమించి, తరువాత అనాలోచితంగా ద్వేషించి, చివరికి తన పొరపాటు గ్రహించి ఆ అమ్మాయిని తిరిగి పొందే క్రమంలో ఆ అనుభవసారాన్ని ఒక చిన్నపిల్లల కథలా రాస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తాడు. ఆ ఆలోచనకి రూపమే ఈ పుస్తకం. ఓపక్క ఒక ఊహాజనిత అనుభవానికి అక్షర, చిత్ర రూపం ఇస్తూనే, అంతర్లీనంగా తన వ్యక్తిగత ప్రేమానుభవాన్ని ప్రకటించే ప్రయత్నం చేస్తాడు ఈ చిత్ర కథానాయకుడు. ఈ కథని తనికెళ్ల భరణిగారు చదివిన విధానం, దానికి ప్రముఖ చిత్రకారుడు చారి పి.యస్.గారు వేసిన అద్భుతమైన బొమ్మల ‘సమ్మోహనం’ చిత్ర పతాక సన్నివేశంలో నటన, గతి, సంగీతం, కళా దర్శకత్వం: ఛాయాగ్రహణాలకి దిశానిర్దేశం చేశాయి. ఈ కథ, బొమ్మలూ చిన్నపిల్లలకి, పెద్దలకి బాగా నచ్చుతాయనే నమ్మకంతో పుస్తకంగా అందిస్తున్నాను’’ అని అన్నారు.