ఇడ్లీలు అమ్మిన మోహన్బాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 24 March 2016
మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమం కోసం సినీ తారలు రకరకాల పనుల్లో కనపడి మరింత క్రేజ్ను స్వంతం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంకోసం ఇప్పటికే రకుల్ప్రీత్సింగ్ రైతుబజార్లో కూరగాయలు అమ్మగా, రానా కూలీగా పనిచేశాడు. అఖిల్ ఆటో డ్రైవర్గా కనిపిస్తే, శ్రీయ సూపర్ మార్కెట్లో సేల్స్గర్ల్ అవతారం ఎత్తింది. ఇప్పుడు తాజాగా మోహన్బాబు ఇడ్లీలు అమ్మే వ్యక్తిగా మారాడు. తిరుపతిలోని శ్రీవిద్యా నికేతన్ స్కూల్లో మోహన్బాబు ఇడ్లీలు అమ్మడం ఆసక్తిగా మారింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన మొత్తాన్ని ‘మేము సైతం’ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు.