వావ్.. చేప పడింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదోరకం డైలాగులతో విడుదలైన ‘ఏడుచేపల కథ’ టీజర్‌కి ప్రపంచంలోని తెలుగు కుర్రోళ్లు ఫుల్‌ఛార్జ్‌తో యాక్టివేట్ అయ్యారు. అడల్డ్ కామెడీగా వస్తున్న చిత్రానికి యూట్యూబ్‌లో 20 మిలియన్ల వ్యూస్ రావటం అతిపెద్ద రికార్డుగా నిలిచింది. అదీ ఆర్గానిక్‌గా రావటంతో టాలీవుడ్‌లో ‘ఏడు చేపల కథ’ సంచలనంగా మారింది. అటు తమిళనాటా టీజర్ సంచలనం కావటం విశేషం. ఇప్పటివరకు ‘మీ టూ’ఉద్యమం ద్వారా ఎంతోమంది మహిళలు తమకు జరిగిన లైంగిక వేధింపుల్ని బహిరంగంగా చెబుతూ కొందరికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కానీ ఇక్కడ టెమ్ట్ రవి ‘మీ టూ’ అంటూ ముందుకొస్తున్నాడు. ‘ఏడు చేపల కథ’ చిత్రంలో టెమ్ట్ రవి విభిన్నమైన పాత్రతో ఇప్పటికే ఫేమస్ అయిపోయాడు. అడల్ట్ కామెడీ జోనర్‌లో పూర్తిగా కొత్తవారితో రూపొందుతున్న చిత్రంలో అభిషేక్‌రెడ్డి, బిగ్‌బాస్ ఫేం భానుశ్రీ, ఆయేషాసింగ్, నగరం సునీల్ తదితరులు నటిస్తున్నారు. రాకేష్‌రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్‌రెడ్డి, జీవీఎన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీజర్‌కు మంచి వ్యూస్ వచ్చిన సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ అడల్ట్ కామెడీ జోనర్‌లో పూర్తిగా కొత్తవారితో చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. ఈ తరహా టీజర్ టాలీవుడ్‌లో ఇప్పటివరకూ రాలేదనే ప్రశంసలతో హ్యాపీగా ఉందన్నారు. దర్శకుడు శామ్ జె చైతన్య విభిన్నమైన కానె్సప్ట్‌ను రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా మలిచాడని, ఆద్యంతం ఆసక్తికలిగించే సన్నివేశాలతో ఏడుచేపల కథ నడుస్తుందన్నారు. అభిషేక్‌రెడ్డికి సినిమా మంచి పేరుతెస్తుందని, తన పెర్ఫార్మెన్స్‌తో ఇంప్రెస్ చేస్తాడన్న నమ్మకం ఉందన్నారు.