ఫిబ్రవరి 17న టీఎస్సార్ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిఎస్‌ఆర్ -టీవీ 9 సంయుక్తంగా నిర్వహించే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌కు విశాఖపట్నం మరోసారి వేదిక కాబోతోంది. 2010నుంచి రెండేళ్ళకోసారి కళాబంధు టి సుబ్బరామిరెడ్డి ఈ అవార్డులను జాతీయస్థాయిలో అందిస్తున్నారు. ఫిబ్రవరి 17న విశాఖపట్నం పోర్ట్‌గ్రౌండ్‌లో వేలాది మంది సమక్షంలో ఘనంగా 2017-18 ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని జరుపబోతున్నట్లు టి.సుబ్బరామిరెడ్డి వెల్లడించారు. మీడియా సమావేశంలో జ్యూరీ ఛైర్మన్ సుబ్బరామిరెడ్డితోపాటు సభ్యులు డా శోభనా కామినేని, పింకీరెడ్డి, నగ్మా, మీనా, పరుచూరి గోపాలకృష్ణ, నరేశ్, కెఎస్ రామారావు పాల్గొన్నారు. వీరితోపాటుగా జీవిత, కె రఘురామ కృష్ణంరాజు సైతం జ్యూరీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన అనంతరం టిఎస్‌ఆర్ మాట్లాడుతూ 2010లో మొదలుపెట్టిన అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం ఆనందంగా ఉందన్నారు. ఈసారి ప్రవేశపెట్టిన శ్రీదేవి మెమోరియల్ అవార్డును విద్యాబాలన్‌కు అందిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమానికి రజనీకాంత్, సూర్య, విక్రమ్‌తోపాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తదితర తారలు హాజరవుతారన్నారు. నెల్లూరులో పుట్టిన సుబ్బరామిరెడ్డికి హైదరాబాద్, విశాఖపట్నంతో విడదీయరాని అనుబంధం ఉందని, ఆయన ఆరాధించే శివుడి ఆజ్ఞతోనే కళాసేవ అపూర్వంగా సాగుతోందని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. తమ జ్యూరీ గౌరవప్రదంగా, అందరికీ ఆమోదయోగ్యమైన నటీనటులను అవార్డులకు ఎంపిక చేస్తుందని నరేశ్ తెలిపారు. తెలుగు చిత్రసీమకు చెందిన అనేకమంది జాతీయస్థాయిలో గుర్తింపు పొందడానికి టి సుబ్బరామిరెడ్డి కారకులని కెయస్ రామారావు చెప్పారు. భారతీయ కళలు, సంస్కృతికి సేవ చేస్తున్న గొప్ప వ్యక్తి సుబ్బరామిరెడ్డి అని నగ్మా అన్నారు. గతంలో అవార్డుల కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యానని, తర్వాత ‘దృశ్యం’చిత్రానికిగానూ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నానని, ఇప్పుడు జ్యూరీలో ఉండటం ఆనందంగా ఉందని మీనా తెలిపారు. రాజకీయ, పారిశ్రామిక, కళారంగాల్లో తనదైన ముద్రవేసిన టి సుబ్బరామిరెడ్డి జీవితాన్ని బయోపిక్‌గా రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని శోభనా కామినేని అన్నారు. తన తండ్రికి వేరెవ్వరూ సాటిరారని, త్వరలోనే ఆయన ఆటోబయోగ్రఫీ విడుదల చేయబోతున్నామని పింకీరెడ్డి చెప్పారు.