ప్రాణం ఖరీదు ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారకరత్న ముఖ్య పాత్రలో ప్రశాంత్ హీరోగా అవంతిక హీరోయిన్‌గా ఎన్‌యస్ క్రియేషన్స్ పతాకంపై పియల్‌కెరెడ్డి దర్శకత్వంలో నల్లమోపు సుబ్బారావు నిర్మించిన చిత్రం ‘ప్రాణం ఖరీదు’. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆడియో ఫంక్షన్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీత సారథ్యంలో రూపొందిన ప్రాణంఖరీదు ఆడియో సీడీలను నిర్మాత కె.యల్.దామోదరప్రసాద్ ఆవిష్కరించారు. చిత్ర నిర్మాత నల్లమోపు సుబ్బారెడ్డి మాట్లాడుతూ సినిమా ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేసే విధంగా ఉంటుంది. ఆదరించాలని కోరారు. దర్శకుడు పియల్‌కె రెడ్డి మాట్లాడుతూ అందరి సహకారంతో మంచి సినిమా చేశాం. నిర్మాత సహకారం మర్చిపోలేం. వందేమాతరం శ్రీనివాస్ మంచి సాంగ్స్ ఇచ్చారు. హీరో ప్రశాంత్ యాక్షన్, సెంటిమెంట్ సీన్స్‌లో అద్భుతంగా చేసాడు. అవంతిక ఎక్స్‌పెక్ట్‌చేసిన దానికన్నా బాగాచేసింన్నారు. హీరో ప్రశాంత్ మాట్లాడుతూ ఈ సినిమా ఎవరినీ డిజప్పాయింట్ చేయదు. ఖచ్చితంగా అందరినీ అలరిస్తుందని హామీ ఇచ్చారు. కె.ఎల్.దామోదరప్రసాద్ మాట్లాడుతూ సినిమామీద ప్యాషన్‌తో యుఎస్‌లో జాబ్ వదిలేసి వచ్చిన ప్రశాంత్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మంచి ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి వచ్చాడు, ఎంకరేజ్ చేయాలన్నారు. హీరోయిన్ అవంతిక మాట్లాడుతూ ఇది నా మూడో చిత్రం. మంచి క్యారెక్టర్ చేశాను. ఈ అవకాశమిచ్చిన అందరికీ కృతజ్ఞతలు అన్నారు.