భయపెట్టే వెంకటలక్ష్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోయిన్ రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. నూతన దర్శకుడు కిషోర్‌కుమార్ దర్శకత్వంలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి సమర్పణలో ఏబీటీ క్రియేషన్స్ పతాకంపై ఎం శ్రీ్ధర్‌రెడ్డి, హెచ్ ఆనంద్‌రెడ్డి, ఆర్కేరెడ్డి నిర్మించిన సినిమా ఈనెల 15న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్మాత ఎం శ్రీ్ధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషన్‌లోవున్న తాను, సినిమాపై ప్యాషన్‌తో నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నానన్నారు. నిజానికి నేను నిర్మాతగా మారడానికి దిల్‌రాజే ప్రేరణ. ఇంజనీరింగ్ చదివే రోజులు నుంచీ ఆయన గురించి తెలుసుకుంటున్నా. ఆయన సినిమాలు తీసే విధానం నచ్చే, నాకూ ప్రొడక్షన్ అంటే ఆసక్తి కలిగింది. మొదటి ప్రయత్నంగా ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ చేస్తున్నాను. ఇది హర్రర్ మూవీకాదు. సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ కొంతభాగమే ఉంటాయి. ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్‌టైనర్. రచయిత తటవర్తి కిరణ్ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ కథ చెప్పగానే నచ్చింది. ఆయనే సినిమా దర్శకుడు కిషోర్‌కుమార్‌ను తీసుకొచ్చారు. సినిమా చాలాబాగా వచ్చింది. ఇది తొలి సినిమా అయినా ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తీశాము. వెంకటలక్ష్మి పాత్రకోసం మొదట వేరే హీరోయిన్లను అనుకున్నారు. కానీ వెంకటలక్ష్మి- పాత్రలో రాయ్‌లక్ష్మీ అయితేనే న్యాయం జరుగుతుందని, నేనే ఆమెను హీరోయిన్‌గా ఎంచుకోవడం జరిగింది. ఇప్పటివరకు తెలుగులో ఆమెకుతగిన పాత్రలను ఎవ్వరూ ఇవ్వలేదు. ఈ సినిమాలో రాయ్‌లక్ష్మీ మంచి పాత్రను చేశారు.
గ్రామీణ నేపథ్యంలో చిత్రం సాగుతుంది. ఇందులో వెంకటలక్ష్మి అనే టీచర్ చుట్టూ కథ నడుస్తుంది. సినిమాలో ప్రధానంగా కామెడీ, హ్యూమర్‌తోపాటు థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయి. అలాగే వినోదంతో పాటు సస్పెన్సూ ఉంటుంది. ఖచ్చితంగా ప్రేక్షకులకు సినిమా నచ్చుతుంది. ఇక తదుపరి చిత్రాల గురించి చెప్పాలంటే రెండు మూడు కథలున్నాయి. అయితే ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’ విడుదల తరువాతే ఏంచెయాలో, ఎవరితో చేయాలో అనేది ఫైనల్ చేస్తాం. ఇకపై వరుసగా సినిమాలు నిర్మిస్తానంటూ ముగించారు.