చలో బాలీవుడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళీ భామ నిత్యామీనన్ దక్షిణాది నాలుగు భాషల చిత్రాల్లో నటించి.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అభినయానికి అవకాశం ఉన్న పాత్రలను మాత్రమే అంగీకరిస్తుందన్న పేరున్న ఆమెకు తెలుగులో కూడా పలు చిత్రాలు పేరుతెచ్చిపెట్టాయి. ఈమధ్యకాలంలో తెలుగులో ఎక్కువ సినిమాలు చేయకపోయినా తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ ఆమె బిజీగానే ఉంది. ఈ నేపథ్యంలో మొదటిసారి ఆమెకు బాలీవుడ్‌నుంచి పిలుపురావడంతో పచ్చజెండా ఊపేసింది. అక్షయ్‌కుమార్, విద్యాబాలన్, సోనాక్షిసిన్హా, తాప్సీ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న మిషన్ మంగళ చిత్రంలో నిత్యామీనన్‌కు కూడా ఓ ప్రధాన పాత్రలో నటించే అవకాశం లభించింది. ఈ చిత్రంలోని ఓ పాత్రలో నిత్యామీనన్ అయితే అన్నివిధాల కరెక్ట్ అని అక్షయ్‌కుమార్ సిఫారసు చేశారట. దాంతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలని చిత్రబృందం లక్ష్యంగా నిర్దేశించుకుంది.