వజ్రాలు కావాలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనిల్, నేహ, నిఖిత హీరో హీరోయిన్లుగా పి.రాధాకృష్ణ దర్శకత్వంలో శ్రీపాద ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కిషోర్‌కుమార్ కోట నిర్మిస్తున్న చిత్రం ‘వజ్రాలు కావాలా నాయన’. ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ క్లాప్‌నివ్వగా కిషోర్‌కుమార్ కోట స్విచ్చాన్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ, కొత్తవాళ్ళకు అవకాశాలివ్వాలనే ఉద్దేశ్యంతో ఈ బ్యానర్‌ను స్థాపించామన్నారు. రాధాకృష్ణ చెప్పిన కథ బాగా నచ్చిందని, ఈ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్‌లో నెల రోజులపాటు చిత్రీకరించి షూటింగ్ పూర్తిచేసి జూలైలో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. దర్శకుడు మాట్లాడుతూ, ఇండియాలో ఫేమస్ అయిన ఓ పాయింట్‌ను తీసుకుని సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని అన్నారు. ఇదే తన మొదటి చిత్రమని, ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలన్నారు. హీరోయిన్ నిఖిత మాట్లాడుతూ, ఇందులో మంచి పాత్ర చేస్తున్నానని, ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ అన్నారు.